ప్రభాస్ గారి ఇంట తీరని విషాదం

ప్రభాస్ గారి ఇంట తీరని విషాదం

ప్రముఖ నిర్మాత నాటి తరం హీరో అయినటువంటి
కృష్ణం రాజు గారు తుది శ్వాస విడిచారు.రెబెల్ స్టార్ గా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించిన నటులు అయిన కృష్ణం రాజు ఇక లేరు.హైదరాబాద్ లోని ఆదివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతం లో తనువు చాలించారు.కృష్ణం రాజు గారికి బార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.ఆయన వయస్సు 83 సంవత్సరాలు.కృష్ణం రాజు గారు కేంద్ర మంత్రి గా కూడా పని చేశారు.గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు.సోమవారం హైదరాబాద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

 ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు అభిమానులు విషాదం వ్యక్తం చేశారు.ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని ప్రముఖ నిర్మాతలు, నటులు పేర్కొన్నారు.బాహుబలి సినిమాలో నటించిన ప్రముఖ నటుడు ప్రభాస్ గారు కృష్ణం రాజు గారి తమ్ముడి కుమారుడే. ఇద్దరు కలసి కొన్ని సినిమాలలో కూడా నటించారు. రీసెంట్ గా వచ్చిన రాదేశ్యాం లో కూడా ఇద్దరు నటించారు.ఇదే ఆయన ఆకరి సినిమా కావడం గమనర్హం.

.

గత ఐదు దశాబ్దాలకు పైగా ఆయన ఎన్నో మంచి పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించారు కృష్ణం రాజు. రాజకీయాలలో కూడ కీలక పాత్ర పోషించారు.
ఆయన లేని లోటు తీర్చలేనిది యావత్తు సినీ పరిశ్రమ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.




Comments

Popular posts from this blog

Telugu cinima muchatlu